భద్రాచలం, వెలుగు : సహజసిద్ధమైన గిరిజన ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన గిరిబజారు పేరును భద్రగిరి మార్ట్గా మార్చినట్టు ఐటీడీఏ పీవో బి.రాహుల్ ప్రకటించారు. ఆయన ఐటీడీఏలో శుక్రవారం జీసీసీ, ఇతర శాఖల ఆఫీసర్లతో ఆయన భేటీ అయ్యారు.
భద్రగిరి మార్టును శ్రీరామనవమి రోజున ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ మార్టు విజయవంతం కావాలంటే వ్యవసాయశాఖ సహకారం కూడా కావాలన్నారు. వ్యవసాయశాఖ ఏడీ, డీఏవో, ఏవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ నిర్వహించారు.
